telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లకు టీపీసీసీ ఎన్నికల కమిటీలు…

congress flags

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఫామ్ లోకి రావాలని చూస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న నాగార్జున సాగర్ ఎన్నికల్లో జనారెడ్డిని ఎలాగైనా గెలిపించాలనే.. ధీమా తో కాంగ్రెస్ ప్రచారం చేసింది. ఇదే ఊపును వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లకు ఎన్నికల్లోనూ కొనసాగించాలని అనుకుంటుంది కాంగ్రెస్. ఇందులో భాగంగానే వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లకు ఎన్నికల కమిటీలను ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి. వరంగల్ కార్పొరేషన్ కు కన్వీనర్ గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కో కన్వీనర్ గా ఎమ్యెల్యే శ్రీధర్ బాబును నియమించింది టీపీసీసీ. అలాగే మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల, డీసీసీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి తో పాటు 13 మంది సభ్యులతో కమిటీ వేసింది టీపీసీసీ. ఖమ్మం కార్పొరేషన్ కు టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు పొన్నం ప్రభాకర్ ను.. కన్వీనర్ గా,  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, డీసీసీ అధ్యక్షులు దుర్గ ప్రసాద్, మాజీ కేంద్ర మంత్రులు రేణుక చౌదరి, బలరాం నాయక్ లతో 11 మందిని సభ్యులుగా కమిటీని ప్రకటించింది టీపీసీసీ. చూడాలి మరి ఈ ఎన్నికలో కాంగ్రెస్ ఏం చేస్తుంది అనేది.

Related posts