లాలూ ప్రసాద్ యాదవ్ మూడేళ్ళ తరువాత తిరిగి స్వరాష్ట్రం వెళ్తున్నారు. దాణా స్కాం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు ఇవాళ దాణా కుంభకోణం కేసులో ఫైనల్గా బెయిల్ వచ్చింది. దీంతో.. ఆయన త్వరలోనే ఇంటికి చేరుకోనున్నారు. కాగా, దుమ్కా ట్రెజరీ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుశిక్షను అనుభవిస్తున్నారు.. గతంలో జార్ఖండ్ రాష్ట్రం బీహార్లో ఉండగా.. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. అక్రమంగా ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 3.13 కోట్లు కాజేశారనే అభియోగాలు నమోదు అయ్యాయి.. దీంతో.. అరెస్ట్లు, విచారణ.. జైలు.. ఇలా సాగిపోయింది. ప్రస్తుతం లాలూ.. ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతుండగా.. ఫైనల్గా నాలుగో కేసులో కూడా బెయిల్ మంజూరు కావడంతో.. త్వరలోనే ఆయన ఇంటికి రానున్నారు.
previous post