చేపలవేటకు వెళ్లి పాక్ చెరలో చిక్కిన 20 మంది భారత మత్స్యకారులకు విముక్తి లభించింది. పాక్లోని లంధి జైలులో ఉన్న జాలర్లను పాక్ ఆదివారం విడుదల చేసింది. జాలర్లను రేపు వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు అప్పగించనున్నారు. పాకిస్థాన్ జైల్లో ఉన్న తెలుగు మత్స్యకారులను విడుదల చేసేందుకు అంగీకరించిన పాక్ ఈ నెల 4వ తేదీన భారత విదేశాంగశాఖకు సమాచారం అందించింది.
తాము విడుదల చేయబోతున్న మత్స్యకారుల జాబితాను సైతం పాక్ ప్రభుత్వం, భారత విదేశాంగ శాఖకు పంపించింది. బతుకు తెరువుకోసం గుజరాత్కు వలస వెళ్లిన మత్స్యకారులు 2018, డిసెంబరులో అనుకోకుండా పాక్ జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో పాక్సైన్యం వారిని అదుపులోకి తీసుకొని బంధించింది.