*కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్
*బీజేపీ గడప తొక్కకముందే వేటు వేసే అవకాశం
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డివ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్గా ఉంది. బీజేపీ గడప తొక్కకముందే అతనిపై వేటువేసే అవకాశం కనిపిస్తోంది.షాకాజ్ నోటీసులు జారీ చేయాలా.. వేటు వేయాలా అనే దానిపై ఢిల్లీలో చర్చ జరుగుతోంది.
పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై ఇప్పటికే రాజగోపాల్రెడ్డి పార్టీ పై పీసీసీ హైకమాండ్కు ఫిర్యాదు చేయగా.. వీడియో క్లిప్పింగ్లు, పత్రిక ప్రకటనలతో నివేదిక అందించింది.
మరోవైపు ..ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్న నేపథ్యంలో మునుగోడుపై కాంగ్రెస్ దృష్టి సారించింది. అభ్యర్థి కోసం మంతనాలు చేపట్టింది. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతి, పల్లె రవి, నల్గొండ ప్రాంతానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు బీజేపీలో రాజగోపాల్ రెడ్డి చేరిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తాజాగా బీజేపీ నేతలు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల, వివేక్ లతో రాజగోపాల్ రెడ్డి సంప్రదింపులు జరిపారు. రెండు మూడు రోజుల్లో మరోసారి నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయనుండటంతో మునుగోడు ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది