telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఎంత సక్కగ రాశారో’ అంటూ చంద్రబోస్‌పై దేవిశ్రీ పాట

Devisri

ప్రముఖ సినీగేయ రచయిత చంద్రబోస్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 25 సంవత్సరాలవుతోంది. 1995లో వచ్చిన తాజ్ మహల్ సినిమాకు తొలిసారి సాహిత్యం అందించిన చంద్రబోస్ అప్పటి నుంచి తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే అనేక అద్భుత పాటలను రాశారు. ఈ నేపథ్యంలో ఆయనపై ఓ పాటను దేవిశ్రీ ప్రసాద్ తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేసి ఆయనకు అభినందనలు తెలిపాడు. రామ్ చరణ్, సమంతల రంగస్థలం సినిమా కోసం చంద్రబోస్ “ఎంత సక్కగున్నావే” పాట రాసిన విషయం తెలిసిందే. ఆ ట్యూన్‌లోనే చంద్రబోస్‌పై ‘ఎంత సక్కగ రాశారో’ అంటూ దేవిశ్రీ పాట పాడారు. ఈ పాట అభిమానులను అలరిస్తోంది. మీరు కూడా ఈ సాంగ్ ను వినండి.

Related posts