telugu navyamedia
సినిమా వార్తలు

మణిరత్నం భారీ ప్రాజెక్టులో క్రేజీ స్టార్స్

Mani-Rathnam

ప్రముఖ దర్శకుడు మ‌ణిర‌త్నం ఈసారి భారీ బ‌డ్జెట్‌తో హిస్టారిక‌ల్‌ చిత్రాన్ని తెర‌కెక్కించడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 800 కోట్ల బ‌డ్జెట్‌తో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించ‌నున్న‌ట్టు స‌మాచారం. క‌ల్కీ రాసిన పొన్నియ‌న్ సెల్వ‌న్ అనే చారిత్ర‌క న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటుంది. ఏడాది చివ‌ర‌లో చిత్రం సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఏఆర్ రెహ‌మాన్ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, మొత్తం 12 పాట‌ల‌ని ఆయ‌న రూపొందిస్తున్నార‌ట‌. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విష‌యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తూ క్లాసిక్ స్టైల్‌లో ట్యూన్స్ సిద్దం చేస్తున్న‌ట్టు టాక్. ఇక న‌టీనటుల విష‌యానికి వ‌స్తే ఇటు సౌత్‌, అటు నార్త్‌కి సంబంధించిన ప‌లువురు స్టార్స్ ఇందులో భాగం కానున్నార‌ని చెబుతున్నారు. మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చారిత్రాత్మ‌క చిత్రంలో జయం రవి, విక్రమ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, మోహ‌న్ బాబు, ఐశ్వ‌ర్య‌రాయ్, అమితాబ్ బ‌చ్చ‌న్ వంటి ప‌లువురు స్టార్స్ న‌టిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

Related posts