తెలంగాణలోని ముచ్చింతల్ శ్రీరామ నగరంలోని శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు.
సంప్రదాయ దుస్తులతో సీఎం జగన్.. ప్రవచన మండపానికి వెళ్ళారు. చినజీయర్ స్వామి సమక్షంలో చిన్నారుల విష్ణు సహస్రనామ అవధానం నిర్వహించారు. ప్రవాస భారతీయ చిన్నారుల అవధానం సీఎం జగన్ వీక్షించారు.
కార్యక్రమం అనంతరం ఆధ్యాత్మిక వేత్త జూపల్లి రామేశ్వరావు జగన్కు రామానుజాచార్యుల ప్రతిమను బహూకరించారు. అనంతరం సీఎం జగన్ సమతామూర్తిని దర్శించుకున్నారు.
అంతకుముందు…ముచ్చింతల్ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, జూపల్లి రామేశ్వరరావు స్వాగతం పలికారు. సీఎం వెంట మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బాలినేని శ్రీనివాస్రెడ్డి ఉన్నారు.