కరోనా నివారణ చర్యలపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్వారంటైన్ లో పరిశుభ్రత, భోజనం, సదుపాయాలపై క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. లాక్ డౌన్ సడలింపుతోఇతర రాష్ట్రాల నుంచి జనాలు భారీగా వచ్చే అవకాశం చెప్పారు. ఈ నేపథ్యంలో క్వారంటైన్ సెంటర్లను పెంచాలని అధికారులను ఆదేశించారు.
విదేశాల నుంచి వచ్చే వారికి నాన్ కోవిడ్ సర్టిఫికెట్ ఉంటుందని, వారందరినీ హోం క్వారంటైన్ కు తరలించాలని జగన్ సూచించారు. గుజరాత్ నుంచి వచ్చిన మత్స్యకారులకు పూల్ శాంపిల్స్ చెక్ చేసిన ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపించాలని ఆదేశించారు. టెలి మెడిసిన్, విలేజ్ క్లినిక్, పీహెచ్సీల మధ్య సరైన సమన్వయం ఉండాలని పేర్కొన్నారు.