*ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాలను ప్రారంభించిన సీఎం జగన్
*వర్చువల్గా ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
*ఏపీలో నేటి నుంచి కొత్త జిల్లాల్లో పరిపాలన ప్రారంభం..
*ఏపీ 13 నుంచి 26 కు పెరిగిన జిల్లాలు..
*నేటి నుంచి పరిపాలన వికేంద్రికరణ ద్వార పాలన
*ప్రజల ఆకాంక్ష మేరకే కొత్త జిల్లాలు
ఉద్యోగులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు
*పరిపాలన సౌలభ్యం కోసం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలు
ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఎలక్ట్రానిక్ బటన్ నొక్కడం ద్వారా కొత్త జిల్లాల ఉనికి అమల్లోకి వచ్చింది.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొత్త జిల్లాల్లోని ఉద్యోగులందరికీ సీఎం జగన్ అభినందనలు తెలిపారు. కొత్తగా 13 జిల్లాల ఏర్పాటుతో పునర్వ్యవస్థీకరించిన 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన చరిత్రలో నవశకానికి నాంది పలకనుందని అన్నారు.
పరిపాలన సౌలభ్యం, వికేంద్రీకరణ కోసమే జిల్లాల పునర్వ్యవస్థీకరణ అని తెలిపారు . ఈ రోజు నుంచి 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ గా మారిందని వైఎస్ జగన్ అన్నారు.చివరగా1970 మార్చిలో ప్రకాశం, 1979లో జూన్లో విజయనగరం జిల్లా ఏర్పడిందని జగన్ గుర్తు చేశారు.
ఏపీలో కొత్తగా. పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య జిల్లాలు ఏర్పాటయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు. నేటి నుంచి కొత్త జిల్లాల్లో కార్యకలాపాలు జరుగనున్నట్లు చెప్పారు.
నిన్నటి వరకు సగటు జిల్లా జనాభా 38.15 లక్షలు అని, ఇంతటి ఎక్కువ జనాభా ఉన్న జిల్లాలు ఉన్నవి ఏపీలోనే అని అన్నారు. ఇప్పుడు జిల్లా సగటు జనాభా 19.07 లక్షలు అని వెల్లడించారు. 18 లక్షల నుంచి 23 లక్షల జనాభా ఉండేలా జిల్లాల విభజన జరిగిందన్నారు. రెవెన్యూ డివిజన్లను 51 నుంచి 72కు పెంచడం జరిగిందని సీఎం జగన్ పేర్కొన్నారు.