telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఎస్సి ల పైనే కేసులు పెట్టిన ప్రభుత్వం దేశం లో జగన్ సర్కార్ మాత్రమే…

chandrababu speech on 12 hrs diksha

అమరావతి ఉద్యమానికి నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ… ప్రధాని జమిలి ఎన్నికలకు పిలుపు నిచ్చారు. ఇంకో రెండేళ్లలో నువ్వు ఏమి చెపుతావ్ అని అమరావతిలో ఎటపాటు చేసిన సభలో సీఎం జగన్ ను ప్రశ్నించారు. బురదలో కూరుకుపోయి నా మెద బురద వేస్తే నువ్వే మునిగి పోతావ్. అవినీతి అన్నావు, ఇన్సెడెర్ ట్రేడింగ్ అన్నావు కొండను తవ్వవు… ఎలుకను కాదు కదా తోకను దాని ఈకను కూడా పట్టుకోలేక పోయావు. పోలీసు లకు చెపుతున్న 22 సంవత్సరాలు మేము ఉన్నాము ఇక్కడ 1 న్నార సంవత్సరం వీళ్లున్నారు ఎన్నికలు వస్తే పోతారు అని పేర్కొన్నారు. మూడు రాజధానులు వాళ్ళు ఎవరు పేటీఎం బ్యాచ్ వాళ్ళది తప్పులేదు. వాళ్ళు వస్తుంటే ఎక్కడినుండి వస్తున్నారు అని అడిగినందుకు ఎస్సి, ఎస్టి  ల పైనే ఎట్రాసిటీ కేస్ పెట్టారు. ఎస్సి ల పైనే ఈ కేస్ లు పెట్టిన ప్రభుత్వం దేశం లో జగన్ సర్కార్ మాత్రమే. ఒక దళిత డాక్టర్ మాస్క్ అడిగితే అతడిని పిచివాడిని చేస్తారా… ఇసుక అక్రమ రవాణా పై ఫిర్యాదు చేస్తే దళిత యువకుడికి శిరోముండనం చేస్తారా.. అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ ను నడిపే అజ్ఞాత శక్తి సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పిన ఆయన  మా‌ఇంటికి తాడులు కట్టి నన్ను అడ్డుకుంటారా… పోలీసులు చట్ట పరంగా పని‌చేయాలి కానీ, వ్యక్తుల ప్రయోజనాల కోసం కాదు అని పేర్కొన్నారు.

Related posts