ఇంగ్లీష్ మీడియం అనేది ఇప్పుడు కనీస అవసరమని, ఇంటర్నెట్, కంప్యూటర్ భాషలన్నీ ఇంగ్లిష్లోనే ఉన్నాయని ఏపీ సీఎం జగన్ అన్నారు. విజయవాడ గేట్వే హోటల్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… తాము కేవలం ఇంగ్లిష్ మీడియాన్ని మాత్రమే తీసుకురావడం లేదని, మొత్తం విద్యావ్యవస్థను మార్చే ప్రయ్నతం చేస్తున్నామని జగన్ అన్నారు.
ఇంగ్లిష్ మీడియాన్ని ప్రారంభిస్తే రాబోయే ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులు తయారవుతారు.ఇంగ్లిష్ మీడియంతో చదివితే పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలదొక్కుకుంటారన్నారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి తండ్రిలాంటి వాడు. ఒక తండ్రిగా మీరు, నేను మన పిల్లల భవిష్యత్తు కోసం విద్యావ్యవస్థలో మార్పులు చేస్తున్నట్టు తెలిపారు.