తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మహారాష్ట్రలోని కొల్హాపూర్ వెళ్లనున్నారు. దేశంలోని శక్తి పీఠాలలో ఒకటైన కొల్హాపూర్ మహాలక్ష్మీ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు.
ఈరోజు ఉదయం 10.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన కుటుంబంతో కలిసి కొల్హాపూర్ బయలుదేరుతారు. మహలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. దర్శనం అనంతరం సాయంత్రం హైదరాబాద్ తిరుగుపయనం కానున్నారు.
లక్ష్మీదేవికి ప్రత్యేకించి ఉన్న ఆలయాల్లో కొల్హాపూర్ కోవెల ముఖ్యమైంది. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలలో ఏడవదిగా చెప్పుకునే ఈ ఆలయాన్ని ప్రతియేటా లక్షలాది భక్తులు దర్శించుకుని ఆమె దీవెనలను కోరుకుంటారు.