telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ హైకోర్టులో 10 మంది న్యాయ‌మూర్తులు ప్ర‌మాణ‌స్వీకారం..

*తెలంగాణహైకోర్టులో నూత‌న న్యాయ‌మూర్తుల ప్ర‌మాణస్వీకారోత్స‌వం
*హైకోర్టులో 10 మంది న్యాయ‌మూర్తులు ప్ర‌మాణ‌స్వీకారం..
* తెలంగాణ హైకోర్టులో 29కి చేరిన సంఖ్య‌

తెలంగాణ హైకో‌ర్టుకు కొత్తగా నియ‌మింంచబడిన 10మంది న్యాయ‌మూ‌ర్తులు ప్రమాణం స్వీకారం చేశారు . వీరితో చీఫ్ జ‌స్టిస్ స‌తీష్ ష‌ర్మ ప్ర‌మాణం స్వీకారం చేయించారు.నూతనంగా నియమితులైన జడ్జిలతో కలిసి హైకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 29కి చేరింది.

కాగా, హైకోర్టులో మొత్తం 42 మంది న్యాయమూర్తులు ఉండాల్సిన హైకోర్టులో.. ప్రస్తుతం 19 మంది సేవలందిస్తున్నారు.  అయితే.. హైకోర్టులో ఒకేసారి పది మంది న్యాయమూర్తులు నియమితులవడం ఇదే మొదటిసారి.

కొత్తగా నియామకం అయిన న్యాయ‌మూర్తులు

కాసోజు సురేందర్‌, సూరే‌పల్లి నందా, ముమ్మి‌నేని సుధీ‌ర్‌‌కు‌మార్‌, జువ్వాడి శ్రీదేవి, ఎన్మీ శ్రవ‌ణ్‌‌కు‌మార్ వెంకట్‌ ఉన్నారు.

న్యాయా‌ధి‌కా‌రులు విభాగం నుంచి జీ.అను‌పమ చ్రక‌వర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్‌రెడ్డి, దేవ‌రాజ్‌. నాగార్జున్‌లను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది.

Related posts