తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ నిప్పులు చెరిగారు. నిజామాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ హిందువుగా పుట్టినందుకు, ముఖ్యమంత్రిగా ఉన్నందుకు భారతదేశం సిగ్గుపడుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం స్థాయికి తగ్గట్టుగా కేసీఆర్ మాట్లాడటం లేదని, ‘చీఫ్ మినిస్టర్ ‘చీప్’గా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నిజామాబాద్ లో టీఆర్ఎస్ కు ప్రజలు మూడో స్థానాన్ని కట్టబెట్టారని అన్నారు. ఇందూరు ప్రజలు బీజేపీకి అనుకూలంగా, ఎంఐఎంకు వ్యతిరేకంగా ఓటు వేసిన విషయాన్ని ప్రస్తావించారు. బీజేపీ హవా కేవలం నిజామాబాద్ లోనే కాకుండా రాష్ట్రంలో కొనసాగుతోందని అన్నారు.
పాకిస్థాన్ గడ్డపై 40 వేల మంది టెర్రరిస్టులు ట్రైనింగ్: ప్రధాని ఇమ్రాన్