telugu navyamedia
రాజకీయ వార్తలు

పాకిస్థాన్ గడ్డపై 40 వేల మంది టెర్రరిస్టులు ట్రైనింగ్: ప్రధాని ఇమ్రాన్

ఉగ్రవాదం పై పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో ఓ కార్యక్రమంలో ఇమ్రాన్ మాట్లాడుతూ పాకిస్థాన్ గడ్డపై 30 వేల నుంచి 40 వేల మంది వరకు టెర్రరిస్టులు ట్రైనింగ్ పొందారని ఆయన తెలిపారు. వీరిలో కొందరు ఆప్ఘనిస్థాన్, కశ్మీర్ లో పోరాడారని చెప్పారు. తమ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ ప్రభుత్వం కంటే ముందు ఉన్న ప్రభుత్వాలకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలన్న రాజకీయ సంకల్పం లేకపోయిందని విమర్శించారు.

2014లో పాకిస్థానీ తాలిబాన్లు ఒక ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న 150 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణచివేచే దిశగా తయారు చేసిన నేషనల్ యాక్షన్ ప్లాన్ పై అన్ని రాజకీయ పార్టీలు సంతకం చేశాయని తెలిపారు. ఇకపై పాకిస్థాన్ గడ్డపై నుంచి ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు ఉండకూడదనే నిర్ణయాన్ని తామందరం కలసి తీసుకున్నామని చెప్పారు.

Related posts