telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

లోకేశ్ పదవి పోతుందని చంద్రబాబు భయం: మంత్రి బొత్స

botsa ycp

భయపడుతున్నారని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లితో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వార్థ ప్రయోజనాలే తప్ప చంద్రబాబుకు ప్రజా ప్రయోజనాలు పట్టవని బొత్స అన్నారు. మండలి ఛైర్మన్‌ షరీఫ్‌.. టీడీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆరోపించారు.

రాజ్యాంగ పరిరక్షణపై చంద్రబాబుకి చిత్త శుద్ధి లేదని ఆయన అన్నారు. శాసన మండలిలో ప్రజాతీర్పును అపహాస్యం చేశారని చెప్పారు. సూచనలు చేయాల్సిన మండలి నిబంధనలను తుంగలో తొక్కిందన్నారు. చంద్రబాబు, యనమల రామకృష్ణుడు వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్లలాంటి వారని చెప్పారు.

చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను ఎలా కొన్నారో చూశామని, ఓటుకు నోటు కేసులో ఎలా దొరికిపోయాడో చూశామని అన్నారు. అందుకే గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ప్రజలు బుద్ధి చెప్పారని విమర్శించారు. ఎమ్మెల్సీలను ప్రలోభపెడుతున్నారని ‘ఈనాడు’లో తప్పుడు కథనాలు రాస్తున్నారని మండిపడ్డారు.1983లో మండలి రద్దుకు అంకురార్పణ చేసినప్పుడు రామోజీరావు సమర్థించారని చెప్పారు.

Related posts