telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఒకే వేదిక‌పై తెలుగు రాష్ర్టాల ముఖ్య‌మంత్రులు..

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు ఒకే వేదిక పై క‌నిపించి సంద‌డి చేశారు. తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మనవరాలు స్నిగ్దా రెడ్డి వివాహం.. ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడు రోహిత్‌ రెడ్డితో శంషాబాద్​లో వీఎన్‌ఆర్‌ ఫామ్స్‌లో ఆదివారం వివాహం ఘనంగా జరిగింది.

హైదరాబాద్‌ లోని శంషాబాద్​లో జరిగిన ఈ వివాహ వేడుకకు ముఖ్య అతిధిలుగా హాజరయ్యారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు.ఒకరినొకరు పలకరించుకున్న ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదిక మీద.. పక్కపక్కన కూర్చుని కాసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం వేదిక మీదకు వెళ్లి వధువరూలను ఆశీర్వదించారు.

గతంలో దిల్లీలో జరిగిన అపెక్స్​ కౌన్సిల్​ సమావేశం అనంతరం తెలుగు రాష్ట్రాల సీఎంలు కలుసుకోవడం ఇదే తొలిసారి. జలవివాదాలు మరోసారి తెరపైకి వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.ఈ క్రమంలో ఇద్దరు సీఎంలు తాజాగా కలవడం.. మాట్లాడుకోవడం.. ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వేడుకలో ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు పలకరించుకున్నారు.

Related posts