telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ…

soyam bapu rao

బీజేపీ ఎంపీ సోయం బాపురావు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. జనవరి 29 నుంచి ప్రారంభమైయ్యే పార్లమెంట్ సమావేశాల్లో నిర్మల్ జిల్లా సమస్యలపై మాట్లాడుతానని ప్రకటించారు.. మరోవైపు.. తెలంగాణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు చేసిన విమర్శలపై ఘాటుగా స్పందించారు.. బండి సంజయ్‌ తోలు తీస్తామంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనడం సరికాదని హితువుపలికిన ఆయన.. సీఎం కేసీఆర్ ఇచ్చే బిస్కెట్ల కోసం, పైసల కోసం, మంత్రి పదవులపై ఆశతో.. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అలా మాట్లాడుతున్నారని ఎద్దేశా చేశారు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇక, రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయడంఖాయమని ధీమా వ్యక్తం చేశారు సోయం బాపురావు.. బీజేపీ పార్టీ మొదటి ఎజెండాగా రామ మందిరం కోసం ఇచ్చిన మాట నెరవేర్చిందన్నారు. మరోవైపు. ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే పనులకు రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం బడ్జెట్ ఇవ్వక పోవడం వల్లే ఆగిపోయిందని ఆరోపించారు బీజేపీ ఎంపీ. చూడాలి మరి దీని పై టీఆరెస్ నేతలు ఎలా స్పందిస్తారు అనేది.

Related posts