టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ర్టవ్యాప్తంగా టీఆర్ ఎస్ శ్రేణులు సంబురాలు అంబరాన్ని అంటాయి. నేటితో సీఎం కేసీఆర్ (ఫిబ్రవరి 17) 68వ వసంతంలోకి అడుగుపెట్టారు.
ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్కు ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్ జన్మదినాన్ని నిర్వహించాలని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈనెల 15 నుంచి నేటి వరకు జన్మదిన వేడుకలను నిర్వహించాలని సూచించారు.
ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామన కేసీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ శ్రేణులు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. అన్నదానం, రక్తదానంతో పాటు రోగులకు, పేదలకు పళ్లు, దుప్పట్లు పంపిణి చేస్తూ సేవ కార్యక్రమాల్ని మూడ్రోజుల పాటు కొనసాగిస్తున్నారు.
కాగా.. ఇటీవల జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించిన ముఖ్యమంత్రి కేసీఆర్ బర్త్డే వేడుకలను ఈసారి ఘనంగా నిర్వహిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై యుద్దం ప్రకటించి దూకుడు పెంచిన కేసీఆర్ ఇప్పటికే పవర్ సెంటర్గా మారారు.
ముఖ్యమంత్రి కేసీఆర్.. 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు వెంకటమ్మ దంపతులకు సిద్దిపేట చింతమడకలో జన్మించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు అహర్నిశలు కేసీఆర్ పోరాడారు. తెలంగాణ రాష్ట్రమే లక్ష్యంగా 2021లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించిన సీఎం కేసీఆర్.. 2009లో స్వరాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఆ తర్వాత కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది.
ఆ తర్వాత నాలుగున్నరేళ్లకు తెలంగాణ కల సాకారమైంది. ఏపీ విభజన తర్వాత 2014లో తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖరరావు (కేసీఆర్) ఎన్నికయ్యారు. అప్పటినుంచి ఆయనే సీఎంగా కొనసాగుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నారు.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ నిర్వహించి తీరుతుంది: లక్ష్మణ్