ఉత్తరప్రదేశ్లోని ఖుషినగర్ జిల్లాలో ఎంతో సంబంరంగా సాగుతున్న వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడి చిన్నారులతోపాటు 13 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మృతుల్లో 9 మంది బాలికలు, ఇద్దరు మహిళలు ఉన్నారు.. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ జిల్లా నెబువా నౌరంజియాలో చోటుచేసుకుంది.
వివాహ కార్యక్రమానికి హాజరయిన కొంతమంది ఇనుప కంచెతో మూసేసిన ఆ పాడుబడ్డ బావిపై కూర్చున్నారు. ఈ క్రమంలో అధిక బరువు కారణంగా కంచె విరిగిపోవడం వల్ల.. కొంతమంది బావిలో పడిపోయారు. వెంటనే చుట్టూ ఉన్నవారంతా వచ్చి.. వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు
ఈ ఘటనపై రాష్ట్రపతి కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రగాఢ సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు.