త్వరలోనే ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేస్తామని ఏపీ మంత్రి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వెల్లడించారు. సీఎం జగన్ ఈ రోజు విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సురేశ్ మాట్లాడుతూ సీఎం జగన్ ప్రైమరీ స్కూళ్లలో మౌలిక సదుపాయాలపై సమీక్ష నిర్వహించారని వెల్లడించారు.
మొదట మండలానికి ఓ పాఠశాలను ఆధునికీకరిస్తామని చెప్పారు. ఆ తర్వాత దశలవారీగా ఇతర స్కూళ్లను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. స్కూళ్లలో టీచర్ల సంఖ్య గురించి మాట్లాడుటూ విద్యార్థుల నిష్పత్తి ఆధారంగా టీచర్ల నియామకం ఉంటుందని వివరించారు.