మెగాస్టార్ చిరంజీవి హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ‘ఆచార్య’. కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా లో రామ్చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదైన పోస్టర్, సాంగ్, ఓ ఊపు ఊపాయి..ముఖ్యంగా లాహె లాహె, నీలాంబరి పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఆచార్య ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగానే ఆచార్య టీం ప్రమోషన్స్ను మొదలు పెట్టింది. ఆ మధ్యన రాంచరణ్ సిద్ద పాత్రని పరిచయం చేస్తూ టీజర్ వదిలారు. టీజర్ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపు చేసింది..
తాజాగా ఈ చిత్రం నుంచి సానా కష్టం అనే మూడో లిరికల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ… చూసేవాళ్ల కళ్లు కాకులు ఎత్తుకుపోనీ.. సానా కష్టం వచ్చిందే మందాకినీ.. నీ నడుము మడతలోన జనం నలిగేపోనీ..’ అంటూ ఈ పాట సాగుతుంది.రేపు పూర్తి లిరికల్ సాంగ్ను విడుదల చేయనున్నారు మేకర్స్.
ఈ స్పెషల్ సాంగ్లో రెజీనాతో కలిసి స్టెప్పులేస్తున్న చిరు.. ఈ సాంగ్ లో రెజీనా అందాలు అరబోస్తూ కుర్రకారుకి మతిపొగెట్టేస్తుంది. చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..ఏ సాంగ్ ఇట్టే ఇరగదీస్తాడు..
ప్రస్తుతం మణిశర్మ కంపోజ్ చేసిన ఈ ప్రోమో సాంగ్ వైరల్ అవుతుంది.. హిట్ గా మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది అంటున్నారు ఫ్యాన్స్.
జగన్ ప్రవర్తనతో ఆశ్చర్యపోయా.. : జేడి చక్రవర్తి