కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే ఈ వైరస్ ఎఫెక్ట్ సినిమాలకు కూడా సోకుతోంది. ఈ వైరస్ కారణంగా పలు టాలీవుడ్ సినిమా షూటింగులు సైతం ఆగిపోతున్నాయి. కాంట్రవర్సి కింగ్ రామ్ గోపాల్ వర్మ సినిమాతో పాటు.. కింగ్ నాగార్జున నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ సినిమా కూడా కరోనా వైరస్తో ఎఫెక్ట్ అయ్యాయి. రామ్ గోపాల్ వర్మ.. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’ అనే మార్షల్ ఆర్ట్స్ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇండో చైనీస్ మ్యూచ్యువల్ ప్రొడక్షన్లో వస్తున్న ఈ సినిమా బ్రూస్ లీకి వీరాభిమాని అయిన ఓ అమ్మాయి బ్యాక్ డ్రాప్లోరూపొందుతుంది. ఈ సినిమాకు సంబందించి కొన్ని సీన్స్ని చైనా పరిసర ప్రాంతాల్లో షూట్ చెయ్యాల్సి ఉంది. కానీ.. ప్రస్తుతం చైనాలో విపరీతంగా ఉన్న కరోనా వైరస్ వల్ల రెడ్ అలెర్ట్ అనౌన్స్ చెయ్యడంతో షూట్ క్యాన్సిల్ చేసుకున్నారు వర్మ అండ్ బ్యాచ్. మరో సినిమా ‘వైల్డ్ డాగ్’ కూడా కరోనా వైరస్కు ఎఫెక్ట్ అయ్యింది. అశుతోష్ సాల్మన్ డైరెక్షన్లో నాగార్జున హీరోగా చేస్తున్న యాక్షన్ మూవీ ‘వైల్డ్ డాగ్’. ఈ సినిమా షూట్ కోసం బ్యాంకాంక్ షెడ్యూల్ ప్లాన్ చేసింది యూనిట్. కానీ ప్రస్తుతం కరోనా వైరస్తో బ్యాకాంక్కి వెళ్ళడానికి రిస్ట్రిక్షన్స్ ఉండడంతో షూట్ పోస్ట్ పోన్ చేసింది టీమ్.
previous post
చిరంజీవి రొమాంటిక్… : మహిమా చౌదరి