“మహర్షి” చిత్రం భారీ విజయం అందుకోవడంతో మంచి జోష్ మీదున్నాడు మహేష్ బాబు. తన 26వ చిత్రాన్ని అనీల్ రావిపూడి దర్శకత్వంలో, దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మాణంలో రూపొందనుంది. ఈ చిత్రంపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి “ఎఫ్-2″తో భారీ హిట్ ను తన కహ్త్తలొ వేసుకున్నాడు. ఇక మే 31న సూపర్ స్టార్ కృష్ణ 77వ బర్త్డే సందర్భంగా ఆ రోజు ఉదయం 9:18ని.లకి చిత్రాన్ని లాంచ్ చేయనున్నారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జగపతి బాబు విలన్ రోల్ లో నటించనుండగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుందని తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు. ఈ సినిమాలో మహేష్ని సరికొత్త లుక్లో చూపించనున్నాడు దర్శకుడు. ఇక ఈ చిత్రానికి “సరిలేరు నీకెవ్వరూ” లేదంటే “రెడ్డిగారి అబ్బాయి” అనే టైటిల్ ఫిక్స్ చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి.
previous post