telugu navyamedia
సినిమా వార్తలు

మొబైల్ సినిమా థియేటర్ లో ఆచార్య

మొబైల్ సినిమా థియేటర్ వచ్చేసింది. ఇది ఒకప్పటి టెంట్ సినిమా థియేటర్ ను గుర్తుకు తెస్తుంది . ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజానగరం జాతీయ రహదారి పక్కన ఈ ధియేటర్ ను ఏర్పాటు చేశారు.

వాతావరణానికి తగ్గట్టు, మంటలు చెలరేగినా ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా గాలి నింపే టెక్నాలజీతో ఈ థియేటర్ ను ఏర్పాటు చేశారు. ఇందులో 120 సీట్లను ఏర్పాటు చేశారు . ఈ ధియేటర్ పూర్తిగా ఏసీ రూపొందిస్తున్నారు.

First mobile movie theater ready in AP

“పిక్చర్ డిజిటల్స్” అనే సంస్ధ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజానగరం లో నెలకొల్పుతున్న మొబైల్ ధియేటర్. ఈ థియేటర్ లో చిరంజీవి రామ్ చరణ్ నటించిన “ఆచార్య” సినిమాతో ప్రారంభం అవుతుంది .

ఈ థియేటర్ ను ఊడతీసి ఎక్కడికైనా సులభంగా తీసుకొని పోవచ్చు. బహుశా ఈ ప్రయోగం సక్సెసైతే దేశంలో ఇలాంటి మొబైల్ సినిమా హాళ్లు ప్రారంభం అయ్యే అవకాశాలు వున్నాయి.

.

Related posts