బాలీవుడ్ ప్రేమజంట ఆలియాభట్-రణ్బీర్ కపూర్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ప్రేమికులుగా ఐదేళ్ల కలిసున్న వీళ్లు ఏడడుగులు వేసి కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు. కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.
గురువారం(ఏప్రిల్14)న రణ్బీర్ కపూర్ ఇల్లు బాంద్రాలోని వాస్తులో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన పెళ్లి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ కొత్త జంటకు పలువురు సెలబ్రిటీలు, ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అయితే రణ్బీర్ మాజీ గర్ల్ఫ్రెండ్స్ దీపికా పదుకోణె, కత్రినా కైఫ్లు న్యూ కపుల్కి బెస్ట్ విషెస్ అందజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేయడం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది.
మీ ఇద్దరికి కంగ్రాట్స్.. ఆల్ ది లవ్ అండ్ హ్యాపీనెస్’ అంటూ కత్రినా ఇన్స్టాలో పోస్ట్ చేసింది. తన పోస్ట్కు రెడ్హార్ట్ ఎమోజీలను జత చేసింది.
మరోవైపు.. జీవితాంతం ప్రేమ, చిరునవ్వు, సంతోషం ఉండాలని కోరుకుంటున్నా అంటూ దీపికా పదుకొణె కామెంట్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి పోస్టులు నెట్టింట వైరల్గా మారాయి