హైదరాబాద్లోని మందు బాబులకు అలెర్ట్.. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని 24 గంటల పాటు బార్లు, మద్యం షాపులు బంద్ చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
రేపు ఉదయం 6 నుంచి ఎల్లుండి ఉదయం 6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు… నిబంధలు అతిక్రమిస్తే కఠినంగా వ్యహరిస్తామని హెచ్చరించారు సైబరాబాద్ సీపీ తెలిపారు
భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో రేపు గౌలిగూడ రాంమందిర్ నుండి తాడుబందు హనుమాన్ ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించనున్నారు.. ఈ నేపథ్యంలోసైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఆంక్షలు విధించారు పోలీసులు.. శోభాయాత్ర ఏర్పాట్లను సీవీ ఆనంద్ పరిశీలించారు.