ఇటీవల చత్తీస్ గఢ్ రాష్ట్రంలో చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ ఉద్యోగాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షలో తొలి రెండు ర్యాంకులను భార్యాభర్తలు సాధించారు. భర్త అనుభవ్ సింగ్ కు మొదటి ర్యాంకు రాగా, భార్యా విభా సింగ్ కు రెండో ర్యాంకు దక్కింది. ఒకరితో మరొకరు పోటీపడి చదవడం ద్వారా ఈ ర్యాంకులు సాధించారు. ఈ పరీక్షల్లో అనుభవ్ సింగ్ కు 298, విభా సింగ్ కు 283 మార్కులు వచ్చాయి. ఈ క్రమంలో అనుభవ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. తామిద్దరం తొలి రెండు ర్యాంకుల్లో నిలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే క్రమంలో పరస్పరం సహకరించుకున్నామని, ఇతర కుటుంబసభ్యులు కూడా తోడ్పాటునందించారని తెలిపారు.
previous post