మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 19వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. హారికా హాసినీ, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు “అలకనంద” అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందుతున్న ఈ చిత్రంలో సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ టబు ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోంది. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు నటిస్తుండడంతో భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాపై భయంకరంగా దుష్ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం హైప్ను తగ్గించేవిధంగా జరుగుతున్న ప్రచారం చిత్ర యూనిట్కు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇటీవల సినిమా కో-డైరెక్టర్తో బన్నీకి గొడవ జరిగిందనే వార్త ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. షూటింగ్ సమయంలో ఇలాంటివి జరుగుతుంటాయని, అయితే బన్నీ గొడవ వ్యవహారాన్ని పెద్దదిగా చూపించే ప్రయత్నం జరిగిందని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇక ఇటీవల ఓ ఇంగ్లీష్ దినపత్రికలో సినిమా ఫలితం గురించి ఓ ఆర్టికల్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో తరచుగా గొడవలు జరుగుతున్నాయని, ఈ సినిమాపై బన్నీకి ఏ మాత్రం ఆసక్తి లేదని, ఈ సినిమా మరో `బ్రహ్మోత్సవం` కాబోతోందని ఆర్టికల్ ప్రచురితమైంది. ఈ వార్తపై బన్నీ ఆగ్రహం వ్యక్తం చేశాడట. ఇంకా 40 శాతం కూడా షూటింగ్ పూర్తి చేసుకోని సినిమా ఫలితం గురించి ముందుగానే ఎలా ఊహించేస్తారని బన్నీ సీరియస్ అయ్యాడట. ఇది కావాలనే ఎవరో చేస్తున్న దుష్ప్రచారంగా బన్నీ భావిస్తున్నాడట.
previous post