ఈ నెల 17, 18 తేదీల్లో పీఈటీ పోస్టులకు ఎంపికైన 1,076 మంది అభ్యర్థులకు నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఏ వాణిప్రసాద్ తెలిపారు. ఈ మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని పేర్కొన్నారు. ఈ నెల 17 నుంచి డిపార్ట్మెంటల్ వైవా.. డిపార్ట్మెంటల్ పరీక్ష మే-2019కి సంబందించిన అభ్యర్థులకు ఈ నెల 17 నుంచి 19 వరకు వైవా వాయిస్ పరీక్షలను నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ కార్యదర్శి తెలిపారు.
హాల్టిక్కెట్లు సహా హాజరుకావాలని వాణిప్రసాద్ సూచించారు. పూర్తి వివరాలు వెబ్సైట్లో పొందుపరిచామని తెలిపారు. వద్దనుకుంటే ఎస్టీటీ పోస్టులు వదులుకోండి.. ఎస్జీటీ ఉద్యోగాలను వదిలి వెళ్లానుకొనే ఇంగ్లిష్, తెలుగు మీడియం పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకొన్నది. ఇందుకోసం ఈ నెల 9 నుంచి 16 వరకు వెబ్సైట్లో అవకాశం అందుబాటులో ఉంటుందని సర్వీస్ కమిషన్ కార్యదర్శి తెలిపారు. పూర్తి వివరాల కోసం కమిషన్ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.