telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

హైదరాబాద్ లో రేపు జరిగే అంతర్జాతీయ తెలుగు మహాసభల కు చంద్రబాబు హాజరుకానున్నారు

ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ తెలుగు మహాసభలను ఈసారి హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.

జనవరి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఈ సభలు జరగనున్నాయి. హెచ్ఐసీసీ నోవాటెల్ లో జరగబోయే ఈ సభలకు చంద్రబాబు హాజరుకానున్నారు.

మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరుకానున్నారు.
ముగింపు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు.

ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు హాజరుకాబోతున్నారు. సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, బాలకృష్ణ, జయప్రద, జయసుధ, మురళీమోహన్ తదితరులు రానున్నారు.

Related posts