telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వ‌ర‌ద, బుర‌ద‌తో మీ ఇళ్ల‌ల్లో ఫ్యాన్ ఆగింది…ఎన్నిక‌ల్లో వైసీపీ ఫ్యాన్ ను ప్ర‌జ‌లు ఆపాలి..

ముంపు ప్రాంతాల‌లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌..
వ‌ర‌ద, బుర‌ద‌తో మీ ఇళ్ల‌ల్లో ఫ్యాన్ ఆగింది..
*ఎన్నిక‌ల్లో వైసీపీ ఫ్యాన్ ను ప్ర‌జ‌లు ఆపాలి..
*పోల‌వ‌రం పూర్తి చేయ‌డం చేత‌కాక‌పోతే ..సీఎం జ‌గ‌న్ రాజీనామా చేయాలి..

*పోలవ‌రం ఎందుకు పూర్తి కాదో నేను చూస్తా..

వ‌ర‌ద, బుర‌ద‌తో మీ ఇళ్ల‌ల్లో ఫ్యాన్ ఆగింద‌ని, వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఫ్యాన్ ను ప్ర‌జ‌లు ఆపాల‌ని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు.

ఏపీ విలీన మండలాల్లో చంద్రబాబు ప‌ర్య‌ట‌న కొన‌సాగుతుంది. ముంపు గ్రామాల్లో పర్యటించిన ఆయన.. వరద బాధితులను పరామర్శించారు.  ఈ సందర్భంగా ఆయన మీట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం పాలిస్తోందని ఆయన విమర్శించారు.

పోల‌వ‌రం పూర్తి చేయ‌డం చేత‌కాక‌పోతే , జ‌గ‌న్ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని అన్నారు .పోలవ‌రం ఎందుకు పూర్తి కాదో నేను చూస్తా అని చంద్రబాబు స‌వాల్ చేసారు.జగన్‌రెడ్డికి కుట్రలు, కుతంత్రాలు తప్ప ఇంకేమీ తెలీదని దుయ్యబట్టారు

అంతకుముందు భద్రాద్రి రామయ్యను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భద్రాచలం కరకట్టను పరిశీలించారు. 20 ఏళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వ హయాంలో కరకట్ట నిర్మాణం జరిగిందని.. ఇప్పుడు అందరినీ కాపాడిందని చంద్రబాబు తెలిపారు. ఇలాంటి వరదలొచ్చినప్పుడు ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో చేతగాని దద్దమ్మ ప్రభుత్వం పాలిస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో పలానా ప్రదేశంలో పిడుగు పడుతుందనే హెచ్చరికలు చేసే వ్యవస్థ కూడా ఏపీలో తీసుకొచ్చామని.. అయితే ఇప్పుడు గోదావరి వరద వస్తే హెచ్చరించే వ్యవస్థ కూడా లేదని చంద్రబాబు ఆరోపించారు.

మనం చేసే అభివృద్ధి, సామాజిక సేవ శాశ్వతంగా ఉండిపోతాయని, ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసమే హైదరాబాద్‌లో ఐటీ రంగానికి ప్రాధాన్యం ఇచ్చానని స్పష్టం చేశారు.

యువత భవిష్యత్తు బాగుండాలంటే తెలంగాణలోనూ తెలుగుదేశం ఉండాల్సిన అవసరముందన్నారు. ఖమ్మంతో తెలుగుదేశం పార్టీకి విడదీయరాని బంధం ఉందన్న బాబు… తెదేపాకు ఉమ్మడి ఖమ్మం జిల్లా కంచుకోటని గుర్తుచేశారు. ఇక్కడి వారిని చూస్తుంటే తెలంగాణతో పాత అనుభవాలు గుర్తుకొస్తున్నాయని అన్నారు.

Related posts