ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో బుధవారం ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నవీన్ ఎన్నికల ప్రచారం నిమిత్తం రూర్కేలా ప్రాంతానికి వెళ్లగా, చాపర్ దిగగానే, దూసుకొచ్చిన అధికారులు, తనిఖీలకు తమకు సహకరించాలని కోరారు. అందుకు నవీన్ అంగీకరించడంతో హెలికాప్టర్ ను తనిఖీ చేశారు. అందులో వారికి ఏమీ దొరకలేదు. చాపర్ ను మొత్తం తనిఖీ చేసేంతవరకూ నవీన్ పట్నాయక్ అక్కడే ఉన్నారు. తనిఖీల పై వివరణ ఇచ్చిన ఈసీ, ఎవరినైనా తనిఖీ చేసే అధికారం ఈసీ సిబ్బందికి ఉందని స్పష్టం చేశారు.
మంగళవారం నాడు కర్ణాటక సీఎం కుమారస్వామి చాపర్ లో తనిఖీలు చేసి, ఒట్టి చేతులతో వెళ్లిపోయిన ,నాడు తనిఖీలు చేసి అందులో ఏమీ డబ్బులు లేవని తేల్చి వెళ్లిపోయారు. బుధవారం ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హెలికాప్టర్ ను కూడా తనిఖీ చేసి వెనుదిరిగారు. 48 గంటల వ్యవధిలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్లలో ఎన్నికల దాడులు జరపడం గమనార్హం.
ఏబీఎన్, టీవీ5 ఛానళ్లను ఎందుకు ఆపారో మంత్రులు చెప్పాలి: దేవినేని