telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మాన్సాస్ ట్రస్టు పరిస్థితి దిగజారడం బాధాకరం: చంద్రబాబు

chandrababu

విజయనగరం మాన్సాస్ ట్రస్టు పరిస్థితి దిగజారడం బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ట్రస్టు ఉద్యోగులు ఐదు నెలలుగా జీతాలు లేక రోడ్డెక్కి భిక్షాటన చేయడం కలచివేసిందని పేర్కొన్నారు. 879 కుటుంబాలు ఇలా రోడ్డెక్కడం గతంలో చూశామా? అని ఆందోళన వ్యక్తం చేశారు. 62 ఏళ్ల మాన్సాస్ ట్రస్టు చరిత్రలో ఈ దయనీయ పరిస్థితి ఎప్పుడైనా ఉందా? అని ప్రశ్నించారు.

ఎంతో ఆర్థిక పరిపుష్టి ఉన్న మాన్సాస్ వంటి సేవా సంస్థ పరిస్థితి ఇప్పుడెందుకిలా తయారైందని ప్రశించారు. సజావుగా అందుతోన్న మాన్సాస్ సంస్థ సేవలను గాడి తప్పించింది ఇందుకేనా? అని నిలదీశారు. ఈ విధమైన దుస్థితి రాకూడదనే విజయనగరం రాజా పీవీజీ రాజు వేలాది ఎకరాల భూములతో, వందల కోట్ల నగదు ఫిక్స్ డ్ డిపాజిట్లతో మాన్సాస్ ట్రస్టును ఆర్థికంగా పరిపుష్టం చేశారని ట్విట్టర్ లో తెలిపారు.

Related posts