telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

చంద్రబాబుకు .. ఎస్కార్ట్ వాహనం బోల్తా..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎస్కార్ట్ పోలీసు వాహనం బోల్తా కొట్టింది. చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా ఆయనకు పోలీస్ ఎస్కార్ట్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. పర్యటన ముగించుకుని వస్తున్న సందర్భంగా పెనుకొండ మండలం వెంకటరెడ్డిపల్లి సమీపంలో జాతీయ రహదారిపై వాహనం బోల్తా కొట్టింది.

ఈ ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ రామాంజనేయులు, ఏఆర్ సీసీ విజయ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Related posts