పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. పోలవరం ప్రాజెక్టులో దోపిడీకి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని ఆయన ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 750 కోట్లు ఆదా చేశామని చెప్పుకుంటూ, రూ. 7500 కోట్ల నష్టాన్ని చేకూర్చారని చెప్పారు. పోలవరం పనులకు గతంలో ఎక్కువ కోట్ చేసిన మేఘా సంస్థే ఇప్పుడు తక్కువ ధరను కోట్ చేసిందని తెలిపారు.
ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించి క్విడ్ ప్రోకోలో భాగంగానే ఇది జరిగిందని ఆరోపించారు. మేఘా కంపెనీకి ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవంటూ సురేంద్రబాబు అడ్డుపడితే, ఆర్టీసీ ఎండీ పదవి నుంచి ఆయనను తప్పించారని విమర్శించారు. గోదావరిలో మునిగిన బోటును ఇంతవరకు తీయలేకపోయారని మండిపడ్డారు. తిరుమలను వివాదాలకు కేంద్రంగా మార్చారని దుయ్యబట్టారు.
అమరావతిలో వేల ఎకరాల భూములు కొన్నారు: విజయసాయిరెడ్డి