telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నారు: చంద్రబాబు

chandrababu

తూర్పుగోదావరి జిల్లాలో జర్నలిస్ట్ సత్యనారాయణ హత్యను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. జర్నలిస్ట్ హత్య రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శనమని అన్నారు. దాడులకు పాల్పడుతూ ప్రశ్నించే గొంతును నొక్కాలని చూస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

సత్యనారాయణ తనకు ప్రాణాపాయం ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను కోరినా, చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని విమర్శించారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయని విమర్శించారు. “జగన్ రౌడీ రాజ్యం” “జగన్ ఫెయిల్డ్ సీఎం” యాష్ ట్యాగ్ తో చంద్రబాబు ఓ పోస్ట్ చేశారు.

Related posts