telugu navyamedia
వార్తలు సామాజిక

బాలు అంత్యక్రియలకు కొద్ది మందికి మాత్రమే అనుమతి: కలెక్టర్

balu

నిన్న మృతి చెందిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు ఈ రోజు ఉదయం 10.30 గంటలకు తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగనున్నాయి. తిరువళ్లూరు జిల్లాలోని తామరైపాక్కంలోని ఆయన ఫామ్ హౌస్ లో అంత్యక్రియల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దగ్గరుండి ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

ఫామ్ హౌస్ కు రెండు కిలోమీటర్ల దూరంలోనే బారికేడ్లను ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. అభిమానులకు ప్రవేశం లేదని, దయచేసి అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. బారికేడ్లను దాటి ఏ వాహనాన్ని కూడా అనుమతించబోమని తెలిపారు. ప్రొటోకాల్ అధికారులకు మాత్రమే ఫామ్ హౌస్ వరకూ అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సాధ్యమైనంత తక్కువ మందికి మాత్రమే అంత్యక్రియలను ప్రత్యక్షంగా చూసేందుకు అనుమతి ఇస్తామని అన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హాజరు కానున్నారు.

Related posts