telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ తో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ భేటీ

Darmendra pradhan

కేంద్ర పెట్రోలియం, ఉక్కు శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు ఉదయం అమరావతి చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర బీజేపీ నాయకులు మాణిక్యాలరావు, ఇతర నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంత్రి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో భేటీ అయ్యారు.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై శ్రద్ధ తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్‌ మంత్రిని కోరారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలుస్తారు. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారిపాలెం పరిధిలో గ్యాస్‌ నిక్షేపాలు వెలికి తీసే ప్రాంతాన ఏర్పాటుచేసిన ఫిల్లింగ్‌ స్టేషన్‌ను ఈరోజు ధర్మేంద్ర ప్రదాన్‌ ప్రారంభించనున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాకను పురస్కరించుకుని, బీజేపీ శ్రేణులు ఇప్పటికే రాజమండ్రి, నాగాయలంక పరిసరాలల్లో స్వాగతం పలుకులతో ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.

Related posts