టాలీవుడ్ సినీ రచయిత యర్రంశెట్టి రమణ గౌతమ్ వేధింపులకు పాల్పడుతున్నాడని అతని భార్య పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఆయనపై పోలీస్ కేసు నమోదు అయ్యింది. తన నగ్న చిత్రాలను యూట్యూబ్లో పెడతానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆమె పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. యర్రంశెట్టి రమణ గౌతమ్ ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో రమణపై అతని భార్య వేధింపుల కేసు పెట్టింది. ఆ తర్వాత పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించడంతో కలిసి ఉండటానికి అంగీకరించాడు. అయితే ఆ తర్వాత రమణ భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు తన పైన పెట్టిన కేసును వాపస్ తీసుకోవాలని, లేదంటే తన నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు. దాంతో రమణ భార్య జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఇప్పుడు ఈ విషయం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
previous post