telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రధాని ముందు జగన్ నాలా మాట్లాడగలడా?: ఏలేశ్వరంలో పవన్ కళ్యాణ్

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పరిధిలోని ఏలేశ్వరంలో జరిగిన వారాహి విజయభేరి సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

తన ప్రసంగంలో, జగన్ వంటి వ్యక్తులు తమపై దాఖలైన చట్టపరమైన కేసులపై చర్చించడానికి ప్రధాని మోడీని ఆశ్రయిస్తున్నారని విమర్శించారు.

అయితే, అలాంటి వ్యక్తులకు మోదీ గౌరవం ఇవ్వరని, అయితే తాను మోదీని సంప్రదిస్తే, ప్రధాని తనకు చాలా గౌరవం ఇస్తారని పవన్ వెల్లడించారు.

ప్రధాని మోదీ వద్ద తాను ధైర్యంగా మాట్లాడగలనని, మోదీ వద్ద మాట్లాడాలంటే జగన్ కు భయం అని ఎద్దేవా చేశారు.

జగన్ లాంటి వ్యక్తులపై మోదీ తప్పకుండా చర్యలు తీసుకుంటారని పవన్ స్పష్టం చేశారు.

తాను లంచాల సొమ్ము, అవినీతి సొమ్ము పై ఆధారపడనని ఆయన నొక్కి చెప్పారు; తాను ఒక సినిమా చేస్తే కోట్లు వస్తాయని అన్నారు.

యువ తరానికి ఉజ్వల భవిష్యత్తును అందించాలనే తపనతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. కూటమి పాలనలో యువత అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు, మూడున్నరేళ్లు సీఎంగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి మన కూటమిలో ఉన్నారు. దశాబ్దకాలంగా పోరాడుతున్న నేను ఉన్నాను. మాకు అండగా నిలబడండి. రాష్ట్రం కోసం పనిచేసే బాధ్యత తీసుకుంటాం అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Related posts