telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చర్యలు తీసుకోవడంలో జగన్ ప్రభుత్వం విఫలం: గల్లా జయదేవ్

galla jayadev got new responsibilities

వరద సహాయక చర్యల్లో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని తెలుగుదేశం నేత, గుంటూరు లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ అన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి ముందస్తు సమాచారం వచ్చినా సరైన చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తాను ఇటీవల లంక గ్రామాల ప్రజలతో మాట్లాడాననీ తెలిపారు.

వర్షాలు లేకుండా ఈ స్థాయి వరదను తాము ఎన్నడూ చూడలేదని ఇక్కడి ప్రజలు చెబుతున్నారని జయదేవ్ తెలిపారు. ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా ఒకేసారి డ్యామ్ గేట్లు తెరవడం వల్లే పలు ప్రాంతాలు మునిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని ప్రభుత్వ నిర్లక్ష్యం అనాలా? లేక అసమర్థత అనాలా? అని జయదేవ్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Related posts