telugu navyamedia
రాజకీయ వార్తలు

ఢిల్లీ వెళ్లిన మంత్రి బుగ్గన..నిర్మల సీతారామన్ తో భేటీ

Buggana Rajendranath

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి కలిశారు. నిర్మలా సీతారామన్ తో భేటీలో రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలపై చర్చించారు. షెకావత్ తో సమావేశంలో ప్రాజెక్టులకు అందాల్సిన నిధులపై పలు విజ్ఞప్తులు చేసింది. పోలవరం ప్రాజెక్టు, విభజన చట్టంలో పెండింగ్ అంశాలపై, జీఎస్టీ బకాయిలు, తదితర అంశాలపై చర్చించామని బుగ్గన వెల్లడించారు. రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులపై చర్చించామన్నారు.

కరోనాతో రాష్ట్రంపై ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాయని అయితే ఈ ఇబ్బందుల విషయాన్ని కేంద్రమంత్రికి వివరించామని తెలిపారు. పన్ను వసూళ్లు తగ్గినందున రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా తయారైందని వివరించారు. పన్ను వసూళ్లలో తొలి 3 నెలల్లో 40 శాతం లోటు ఏర్పడిందని తెలిపారు. జీఎస్టీ బకాయిలు రూ.3 వేల కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. బకాయిలతో పాటు అదనంగా మరికొన్ని నిధులు ఇచ్చి సహకరించాలని నిర్మలా సీతారామన్ ను కోరామని వివరించారు.

Related posts