telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఆర్టీసీ బస్సులో సైకో బీభత్సం.. లేడీ కండక్టర్‌తో పాటు ఇద్దరిపై దాడి

Parents Murdered Daughter at Mancherial

ఆర్టీసీ బస్సులో ఓ సైకో బీభత్సం సృష్టించాడు. లేడీ కండక్టర్‌తో పాటు మరో ఇద్దరిపై సైకో కత్తితో దాడి చేశాడు. దీంతో సైకోను ప్రయాణికులంతా కలిసి చితకబాది పోలీసులకు అప్పగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందపల్లి నుంచి ముష్టిబండకు బస్సు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. బస్సులోకి ఎక్కిన ఓ సైకో లేడీ కండక్టర్‌తో పాటు మరో ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. దీంతో ప్రయాణికులంతా కలిసి మూకుమ్మడిగా సైకోను చితకబాది పోలీసులకు అప్పగించారు. అతని నుంచి నాలుగు కత్తులను సైతం ప్రయాణికులు స్వాధీనం చేసుకున్నారు.

Related posts