telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు, జగన్ ఇద్దరూ దొందూ దొందే: కన్నా

Kanna laxminarayana

చంద్రబాబు, జగన్ ఇద్దరూ దొందూ దొందేనని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. చంద్రబాబు హయాంలో ఇసుక మాఫియా కొనసాగిందని, జగన్ హయాంలో కృత్రిమ ఇసుక కొరతను సృష్టించారని ఆయన విమర్శించారు. ఇసుక కొరతపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలుత నిలదీసింది బీజేపీనే అని అన్నారు. ఇసుక కొరతపై పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్నా ప్రభుత్వ తీరు దున్నపోతుపై వాన పడినట్టుగానే ఉందని విమర్శించారు.

ఏపీలో మతమార్పిడిలు భారీ ఎత్తున జరుగుతున్నాయనిఆందోళన వ్యక్తం చేశారు. మత మార్పిడిలను ప్రోత్సహించడం సమాజానికి మంచిది కాదని అన్నారు. రాష్ట్రంలో దేవాలయాలను కూలగొట్టి, విగ్రహాలను తొలగిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం కూడా ఇలాగే చేసి అడ్రస్ లేకుండా పోయిందన్నారు. పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంకు తాము వ్యతిరేకం కాదని… కాకపోతే, తెలుగు మీడియంను కూడా కొనసాగించాలని కోరుతున్నామని కన్నా చెప్పారు. ఇంగ్లీష్ మీడియం కోసం ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేయాలని సూచించారు.

Related posts