ఏపీని నంబర్ వన్ గా చేయడానికి చంద్రబాబు నిరంతరం కృషి చేశారని ఆయన భార్య భువనేశ్వరి అన్నారు. ఎర్రబాలెంలో రైతుల దీక్షలో చంద్రబాబు, భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ…రాత్రింబవళ్లు చంద్రబాబు రాష్ట్రం కోసం కష్టపడ్డారని ఆమె చెప్పుకొచ్చారు. ఎల్లప్పుడూ అమరావతి, పోలవరం అని చంద్రబాబు తపించారని అన్నారు.
ఆరోగ్యం కూడా లెక్క చేయకుండా ప్రజల కోసం కష్టపడ్డారని తెలిపారు. ప్రజల తరువాతే, తనను, కుటుంబాన్ని పట్టించుకునే వారని ఆమె తెలిపారు .రైతులకు పూర్తి మద్దతుగా మా కుటుంబం అండగా ఉంటుందని చెప్పారు. మహిళలు పడుతున్న బాధను తోటి మహిళగా అర్థం చేసుకున్నానని భువనేశ్వరి అన్నారు. అమరావతి రైతుల నమ్మకాన్నిచంద్రబాబు వమ్ము చేయరని ఆమె తెలిపారు.
ఎలా గెలిచారో తెలిసిపోయింది.. సీఎం జగన్ పై లోకేశ్ విమర్శలు