telugu navyamedia
ఆంధ్ర వార్తలు

‘భీమ్లా నాయక్’’ విడుద‌ల : థియేటర్​పై రాళ్లు రువ్విన పవన్ అభిమానులు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ , రానా క‌లిసి నటించిన ‘‘భీమ్లా నాయక్’’ చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ర్టాల్లో ప‌వ‌న్ అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు.  పవన్ కల్యాణ్​ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. థియేటర్ల వద్ద పండగ వాతవరణం నెలకొంది.

అయితే ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాలలో ‘భీమ్లానాయక్’ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద పవన్ పవన్ కల్యాణ్ అభిమానులు థియేటర్ల ప్రాంగణమంతా పవన్ కల్యాణ్​ ఫ్లెక్సీలతో నింపేశారు. ఓ అభిమాని చేతిలో కర్పూరం వెలిగించుకుని జై పవన్ అంటూ నినాదాలు చేశాడు. అర్దరాత్రి నుంచే అభిమానులు థియేటర్ల వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.

మ‌రోప‌క్క‌..బెనిఫిట్ షో ఉందంటూ టిక్కెట్లు విక్రయించి తర్వాత వేయకపోవడంతో గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో పవన్ కల్యాణ్​ అభిమానులు ఆందోళనకు దిగారు. ఉదయం 10.30 గంటలకు షో ఉంటుందని.. ఆ ఆటకు టికెట్లు ఉపయోగించుకోవాలని థియేటర్ యాజమాన్యం సూచించింది. కోపంతో థియేటర్​పై రాళ్లు రువ్వారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో మార్నింగ్ షోకు అనుమతిస్తామని చెప్పడంతో అభిమానులు శాంతించారు.

Related posts