పవర్ స్టార్ పవన్ కల్యాణ్ , రానా కలిసి నటించిన ‘‘భీమ్లా నాయక్’’ చిత్రం ఈరోజు విడుదలైంది. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్ర్టాల్లో పవన్ అభిమానులు థియేటర్ల వద్ద సందడి చేస్తున్నారు. పవన్ కల్యాణ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. థియేటర్ల వద్ద పండగ వాతవరణం నెలకొంది.
అయితే ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాలలో ‘భీమ్లానాయక్’ సినిమా ప్రదర్శించే థియేటర్ల వద్ద పవన్ పవన్ కల్యాణ్ అభిమానులు థియేటర్ల ప్రాంగణమంతా పవన్ కల్యాణ్ ఫ్లెక్సీలతో నింపేశారు. ఓ అభిమాని చేతిలో కర్పూరం వెలిగించుకుని జై పవన్ అంటూ నినాదాలు చేశాడు. అర్దరాత్రి నుంచే అభిమానులు థియేటర్ల వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.
మరోపక్క..బెనిఫిట్ షో ఉందంటూ టిక్కెట్లు విక్రయించి తర్వాత వేయకపోవడంతో గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో పవన్ కల్యాణ్ అభిమానులు ఆందోళనకు దిగారు. ఉదయం 10.30 గంటలకు షో ఉంటుందని.. ఆ ఆటకు టికెట్లు ఉపయోగించుకోవాలని థియేటర్ యాజమాన్యం సూచించింది. కోపంతో థియేటర్పై రాళ్లు రువ్వారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో మార్నింగ్ షోకు అనుమతిస్తామని చెప్పడంతో అభిమానులు శాంతించారు.