తెలుగు రాష్ట్రాలను ఒమిక్రాన్ వణికిస్తోంది. నిన్నమొన్నటిదాకా పొరుగు రాష్ట్రాల్లో ఆనవాళ్లతో హడలెత్తించిన ఒమిక్రాన్… తాజాగా తెలుగు రాష్ట్రాలను దడపుట్టిస్తోంది. లండన్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా చేరుకున్న వ్యక్తికి కోవిడ్ లక్షణాలున్నట్లు గుర్తించారు.
లండన్ నుంచి సంతబొమ్మళి మండలం ఉమిలాడ చేరుకున్న వ్యక్తి కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి తొలి ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు ప్రచారం జరుగుతోంది. లండన్ నుంచి వచ్చిన వ్యక్తినుంచి నమూనాలు సేకరించి జినోమ్ సిక్వెన్సింగ్ పరీక్షల కోసం పంపారు.