telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కరోనా మృతులను జేసీబీతో తరలించడం దారుణం: చంద్రబాబు

chandrababu

శ్రీకాకుళం జిల్లాలో కరోనా మృతులను జేసీబీతో తరలించడం పట్ల టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరోనా వైరస్ తో మృతి చెందిన వారిని ప్లాస్టిక్ పేపర్లలో చుట్టి జేసీబీలు, ట్రాక్టర్లలో తీసుకెళ్లడం దారుణం అని వ్యాఖ్యానించారు. మరణానంతరం కూడా వారికి తగిన గౌరవమర్యాదలు ఇవ్వడం అవసరం అని స్పష్టం చేశారు. మృతదేహాలను ఈ విధంగా అమానవీయ రీతిలో తరలిస్తుండడం పట్ల సీఎం జగన్ ప్రభుత్వం సిగ్గుపడాలి అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.

ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా ఘాటుగా స్పందించారు. పారాసిటమాల్ వేసుకుంటే కరోనా తగ్గిపోతుందని సీఎం జగన్ చెప్పినరోజే వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి అర్థమైందని ట్వీట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన ఘటన దారుణమని, ఈ ప్రభుత్వానికి మానవత్వం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వదలాలి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts