telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

2022 ఐపీఎల్ లో 10 జట్లు…

new feature in ipl 2020

యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 జరగడం… అది సూపర్‌ సక్సెస్‌ కావడంతో బీసీసీఐ 14వ సీజన్‌ను భారత్‌లో నిర్వహించేందుకు సిద్ధమైంది భారత బోర్డు. అయితే వచ్చే ఐపీఎల్ లో రెండు కొత్త జట్లు రానున్నట్లు ఎప్పటినుండో వార్తలు వస్తున్నాయి. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రెండు కొత్త జట్లను చేర్చడం పై ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ చర్చించి కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ లో రెండు కొత్త జట్లకు చేర్చడానికి బీసీసీఐ ఆమోదం తెలిపింది. కానీ అది వచ్చే ఏడాది కాకుండా 2022 ఐపీఎల్ సీజన్ 10 జట్లతో నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. అయితే కొత్తగా రెండు జట్లను చేరిస్తే మెగా వేలాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది ఐపీఎల్ ఆలస్యంగా జరగడంతో ఐపీఎల్ 2021 సీజన్ కోసం మెగా వేలాన్ని నిర్వహించే సమయం లేకపోయింది. దాంతో ఆ తర్వాత వచ్చే ఏడాది ఐపీఎల్ 15 సీజన్ కు ముందు మెగా వేలాన్ని నిర్వహించి 10 జట్లతో అభిమానుల ముందుకు రావాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలిస్తుంది. అయితే అందులో అందులో ఒకజట్టు అహ్మదాబాద్ కు సంబంధించింది కాగా మరొకటి కేరళకు సంభందించిన జట్టుగా వార్తలు వస్తున్నాయి.

Related posts